రాజ్యం బలహీనంగా ఉన్నప్పుడూ, జనం సన్యాసుల మత్తు బిళ్ళలు మింగినప్పుడూ
బాబా గాళ్ళ ఆలోచనలే తుపాకీలవుతాయి. తూటాలై ప్రాణాలు తీస్తాయి. మానవ బాంబులై సమూహాల్లో తిరుగుతాయి. వెనకటికి ఇలాంటి కథలు చాలానే ఉండుంటాయి. ఎదో ఒక కథను చర్చించుకునే సందర్భం కానే కాదిది.
కొత్తగా ఏం జరిగిందని బాస్ ... ఎప్పుడూ జరిగేదే కదా
మన తాతలు చూసిందే కదా, మన నాన్నలు చూసిందే కదా, మనం చూస్తూ ఉన్నదే కదా !
అయితే ఇక్కడ
బయటకు కనపడని చాలా విషయాలు దాగున్నాయి. కొందరు బాబాలు రాజ్యానికి మద్దతు గానూ, మరి కొందరు రాజ్యానికి వ్యతిరేకంగానూ ఉంటారు. రాజ్యం మారినప్పుడు ... ప్రతి కొత్త రాజ్యం తరపునా ఎంతో కొంతమంది బాబాలు ఉంటూనే ఉంటారు. బాబాలకు రాజ్యం తోలు అవసరం. రాజ్యానికీ బాబాల తోలు అవసరం. ఎటొచ్చీ అర్ధం కాని తనంలో, అర్ధం చేసుకోని తనంలో తరాలుగా బానిసలుగా, భక్తులుగా ఓడిపోతుంది మామూలు జనమే.
డేరా వ్యవస్థ ఇప్పుడు పుట్టిందేం కాదు. స్వాతంత్రానికి పూర్వం నుంచే మన దేశంలో బలంగా పాతుకుపోయింది. దీనికి కులాలూ, మతాలూ, ఆధిపత్యం, అణగదొక్కపడటం లాంటి కారణాలున్నాయి. నీచానికి నీచంగా అణగదొక్కబడుతున్న కులాల తరపున .... కుల వ్యవస్థనూ, మతాల పోకడనూ అడ్డుకట్టి బలహీన వర్గాల వైపు నిలబడటానికి డోరా విధానం మొదలైంది. అయితే రానురాను అది కూడా మరో మతంలా తయారయింది.
ఎంతలా అంటే తాము నమ్మిన వ్యక్తి తప్పు చేశాడని తెలిసినా, సమర్దించుకునే అంత... 50 పైన రేప్ కేసులు ఉన్న వ్యక్తిని మంచోడూ అని చెప్పే అంత... అతని కోసం మూర్ఖంగా అతని సైన్యంలా మారి సమూహాల మీద పడి పాశవికంగా మనుషులను చంపే అంత...
అంతే కదా...
ఎప్పటికీ మనుషులే కదా... మాయలో పడేది. మోసపోయేది. రాజ్యానికో, బాబాలకో, అత్తెసరు సౌకర్యాలపేరుకో లొంగిపోయేది.
ఇప్పుడు డేరా వ్యవస్థకు పెద్దగా ఉన్న గుర్మీత్ బాబా ఇప్పటికే ఎన్నో దారుణాలు చేసున్నాడు. డేరా వ్యవస్థకు పెరిగిన క్రేజ్ ను వ్యాపారాల కోసం, వ్యక్తిగత సుఖాల కోసం వాడుకుని, కబ్జాలు చేసి, ఎంతో మందిని కొల్లగొట్టి... సామాన్యులు ఊహించలేనంత, కాలుక్యులేటర్లు లెక్కేయలేనంత ఆస్తులు సంపాదించాడు.
ఈ తతంగం అంతా నడుపుతూనే 5 కోట్ల మంది అభిమానులనూ, భక్తులనూ, సానుభూతిపరులనూ, లక్షల మంది ప్రయివేటు సైన్యాన్నీ సిద్ధం చేసుకున్నాడు.
ఇక్కడ బాబా ఆడిన మైండ్ గేమ్ వెనుక చాలా సింపుల్ ఫార్ములా ఉంది. రూపాయి ఖర్చుపెట్టి ఫండ్స్ రూపంలో వేలు రాబట్టుకున్నాడు. మళ్లీ వచ్చిన డబ్బులోని వెయ్యో వంతును జనాలకోసం, పిల్లల చదువుకోసం ఉపయోగించాడు. ఏదో ఒకరోజు తమకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక సైన్యం కావాలి కాబట్టి భిక్ష వేస్తారు. కొందరిని సోమరిపోతులను చేస్తారు. వాళ్ళ జీవితాల్ని వీరి ప్రయాణానికి రహదారులను చేసుకుంటారు. సరిగ్గా ఈయన కూడా ఇదే చేశాడు.
అయితే ఇక్కడ ఇంకో మలుపు ఉంది. ఇప్పుడు బీజేపీ రాజ్యం ఆడుతున్న డ్రామా ఉంది.
ముందుగా అనుకున్నట్టు రాజ్యానికి బాబాల తోలు కావాలి. బాబాలకూ రాజ్యం తోలు కావాలి. కానీ ఇక్కడ డోరాబాబా బలమైన శక్తిగా ఎదిగి, రాజకీయాన్నీ పులుముకుని తానే రాజ్యం అయ్యే ఆలోచన దిశగా సాగుతున్నాడు.
మనం ఇక్కడొకటి గుర్తుంచుకోవాలి. గాడి తప్పిన రాజ్యమూ, బాబాలూ ఒకే అంత క్రూరమైన వాళ్ళు.
ఎప్పటి నుండో కేసులున్న ఈ బాబా విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడానికి చాలా రాజకీయ కారణాలూ ఉన్నాయి. బీజేపీ అడుగులకు మడుగులద్దే రామ్ దేవ్ బాబా లాంటి వాళ్ళ బలం పెంచే ఆలోచన కూడా ఉంది.
రాజ్యం తన ఉనికినీ, వ్యాపరాలనూ శక్తినీ కాపాడుకునే కుటిల యోచన ఉంది.
అలా అని శిక్ష వేయడం సరైంది కాదూ అనడం లేదు. కచ్చితంగా ఈ బాబా వెదవే, జనాల జీవితాలను సెవాలను చేసి వాటిపై బ్రతుకు ప్రయాణం చేసే ఉన్మాదే. ఇతనికి కచ్చితంగా శిక్ష పడాలి.
బాబా కొన్నేళ్లుగా ఆడిన డ్రామాలో తమకి తెలియకుండా తామే బాబా ప్రయివేటు సైన్యంగా మారిన జనాలకు అర్థం అయ్యేలా విషయాన్ని తెలియపరచాలి.
నిజానికి ఇది అనువైన సమయం
బాబాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం
ఈ ఒక్క బాబానే కాదు
రాజ్యం నుదిటిపై విభూదై, జనాల ఆశపై, అమాయకత్వంపై మతం మరకలై
నడుస్తూ దేశాన్ని యుగాల వెనక్కు నడిపిస్తోన్న బాబాల అందరి పైనా పోరాడాలి. రాజ్యం ముసుగులో తల దాచుకున్న ఒక్కోబాబానూ వెతికివెతికి శిక్షించాలి.
వీటన్నింటి కంటే ముందు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. బాబాలకు మనం ఇచ్చే స్థానం మారాలి. అసలు బాబాలే లేని రోజు రావాలి. మన చుట్టూ ఉండేవారికి మనం ఆలోచన కలిపించాలి.
బాబాలూ అబద్దమనీ, మతాలు అక్కర్లేదనీ, కులాలు మనకడ్డమనీ... ఇదంతా మీకు వీలైనంత ఎక్కువ మందికి చెప్పండి ... Thank you
No comments:
Post a Comment