*ఏమి దేశం రా బాబూ ?*
అప్పుడెప్పుడో *MGR చనిపోతే 6 మందికి గుండె ఆగిపోయిందిట.*
తర్వాత సెల్వీ (అనగా కుమారి ) జయలలిత *అవినీతి కేసులో జైలు కు వెళితే 11 మంది తమిళ తoబిలు ఆత్మాహుతి చేసుకున్నారు .*
ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ వైఎస్సార్ అకాల మరణం తో వందల కొద్దీ అభిమానుల గుండెలు ఆగాయి. *7 ఏళ్ళ పాటు సాగిన ఓదార్పు యాత్రల బట్టి మనం నమ్మక తప్పదు.*
తనకు గానీ తన వారికి గానీ ఏమీ మిగుల్చుకోకుoడా *దేశం అభ్యున్నతి కే అంకితం అయిన అబ్దుల్ కలాo చనిపోయినప్పుడు ఏ ఒక్క గుండె కూ హాని జరగలేదు .*
గోరక్పూర్ ఆసుపత్రి లో oxygen అందక *50 మంది అమాయక పసి ప్రాణాలు పోతే ప్రజల తిరుగుబాటు లేదు.*
కాగా వీడెవడో *బురిడీ బాబా గాడి పాపం పండి రేప్ కేస్ లో శిక్ష పడి జైలు కు వెళితే ఇంత తిరుగుబాటా?*
ఇంత హింసా? 4రాష్ట్రాలు అట్టుడికి పోవాలా ?
428 రైళ్ళు ఎక్కడివి అక్కడే ఆగిపోయి వేలాది ప్రయాణీకులు తిండీ తిప్పలు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడపాలా ?...
మాతృ దేశం గురించి గర్వ పడే క్షణాలు ఎన్నో ఉంటాయ్.
కానీ సిగ్గుపడే క్షణాలు కూడా కొన్ని ఉంటాయ్ ఆని అప్పుడప్పుడూ తెలిసి వస్తోంది .
ఏమి దేశం రా బాబూ ?
మనదేశంలో ....
రేపులు చేసినోడు *బాబా* అవుతాడు..
హత్యలు చేసినోడు *నాయకుడు* అవుతాడు..
అవినీతి చేసినోడు *అదికారి* అవుతాడు..
పంట పండించేవాడు *అడుక్కతింటాడు..*
కష్టపడి చదివిన వాడు బికారి అవుతాడు..
న్యాయంగా ఉండేవాళ్లంతా *నాశనం* అవుతారు..
*ఇదే మన 70 ఏళ్ల స్వతంత్ర్య దేశం..!!*
No comments:
Post a Comment